
ఇబ్రహీంపట్నం, జూలై 17(సంచలనం న్యూస్): నియోజకవర్గం లోని మంచాల, మండలం, లోయపల్లి గ్రామానికి చెందిన కొర్ర రమేష్ నాయక్ తండ్రి మోతీరాం నాయక్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రి లొ చికిత్స పొందుతూ వైద్య ఖర్చుల నిమిత్తం ఇబ్బంది పడుతున్న సందర్భంలో టిపిసిసి సభ్యులు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి ను సంప్రదించగా తక్షణమే స్పందించి తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో 3లక్షల రూపాయల ఎల్ వో సి ని మంజూరు చేయించి మర్రి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా చెక్ ను శుక్రవారం నాడు కొర్ర రమేష్ నాయక్ కుటుంబ సభ్యుడు సోదరుడు కొర్ర భాస్కర్ నాయక్ అందజేశారు. ఈ సందర్భంగా కొర్ర రమేష్ నాయక్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆపద సమయంలో వెంటనే స్పందించి మమ్మల్ని ఆదుకున్న మర్రి నిరంజన్ రెడ్డి మరియు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొర్ర రమేష్ నాయక్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గణేష్ నాయక్, మోహన్ నాయక్ పాల్గొన్నారు.